గ్రేటర్ హైదారాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలని మిత్రులు ఆలోచిస్తున్నారట.ఎవరీ మిత్రులు? వీరు వ్యక్తులు కారు.టీడీపీ, బీజేపీ పార్టీలు.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆశలు నెరవేరలేదు.కాబట్టి ఈ రెండు పార్టీలు రాబోయే హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నాయి.ఈ పార్టీలు సుప్రీం కోర్టులో ఎందుకు కేసు వేయాలని నిర్ణయించుకున్నాయి? నగర పాలక సంస్థ పరిధిలో వార్డుల విభజనను ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.బీసీ ఓటర్ల నమోదు సరిగా జరగలేదని, ఓటర్ల జాబితాల నుంచి చాలామంది ఓటర్ల పేర్లు తీసి వేశారని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఈ అవకతవల మీద సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నాయి.
నగరంలో వార్డుల విభజన అధికార గులాబీ పార్టీకి, ఎం ఐ ఎం పార్టీకి అనుకూలంగా జరిగిందని పసుపు, కాషాయం పార్టీలు ఆరోపిస్తున్నాయి.మేయర్ పదవిని చేజిక్కించు కోవడానికి అధికార పార్టీ కుట్ర పన్నుతున్నదని బీజేపీ ఆరోపిస్తోంది.
నగర పాలక సంస్థ ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో కారు పార్టీని గెలవనివ్వకూడదని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.