ఈ జెనరేషన్ అమ్మాయిలు అందాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దానితో డబ్బు సంపాదించి ఖరీదైన జీవితం గడపడమే లక్ష్యాలుగా పెట్టుకుంటున్నారు.దాని కోసం అన్నిరకాల అడ్డమైన పనులు చేస్తున్నారు.
అయితే ఇలా చేస్తున్నవారు కొద్దిమందే అయిన అమ్మాయిలు చేసే మోసాలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.సినిమాలలో పెద్ద హీరోయిన్స్ అయిపోవాలని వచ్చే అందమైన అమ్మాయిలు ఇక్కడి ఖరీదైన జీవితానికి అలవాటు పడి ఎక్కువగా దారి తప్పి ఇలాంటి మోసాలకి పాల్పడుతూ ఉంటారు.
ఇప్పుడు తమిళనాడులో ఒక హీరోయిన్ కూడా అలాగే పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి వారి దగ్గర డబ్బులు భారీగా గుంజింది అని పోలీసులు గుర్తించారు.
చెన్నైలో స్థానికి మైలాపూర్కు చెందిన నటి శ్రుతి ఆడి పోనా ఆవడి అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అవకాశాల్లేక చదువుకోవడానికి లండన్కు వెళ్లింది.ఆమె తల్లిదండ్రులు శ్రుతికి పెళ్లి చేయాలని నిర్ణయించి ఫోటోలు మ్యాట్రిమనిలో పెట్టారు.అది చూసిన జర్మనీ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవైకు చెందిన బాలమురుగన్ నటి శ్రుతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.అలా ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది.
కొద్ది రోజుల తర్వాత శ్రుతి తన తండ్రికి భాగోలేదని వైద్య ఖర్చుల కోసం డబ్బులు కావాలని చెప్పడంతో అతను 45 లక్షల వరకు ఇచ్చాడు.తరువాత అతనికి శ్రుతి ముఖం చాటేసింది.
మోసపోయా అని గ్రహించిన బాల మురుగున్ తల్లిదండ్రుల సాయంతో ఫిర్యాదు చేయగా శ్రుతితో పాటు ఆమె తల్లి, సోదరుడు సుభాని అరెస్ట్ చేశారు.అయితే అంతకు ముందే ఆమె ఇలాగే చాలా మందిని పెళ్లి పేరుతో మోసం చేసి తల్లి సాయంతో లక్షలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆమె చేతిలో చెన్నైకి చెందిన ఆముదన్ అనే వ్యక్తి కూడా ఇలాగే మోసపోయాడని, వీళ్ళ తప్పుడు ఫిర్యాదుతో అతనిని గతంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఒక్కొక్కటిగా శ్రుతి మించి చేసిన మోసాలని బయటకి తీస్తున్నారు.