'సైరా' టీంను అక్కడ నుండి తరిమి కొట్టిన ముస్లీం యువకులు

మెగాస్టార్‌ చిరంజీవి 151 చిత్రం సైరా నరసింహారెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెల్సిందే.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.చిరంజీవి ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సీన్స్‌ను కోకాపేటలోని భారీ సెట్టింగ్‌లో చేస్తున్నారు.అయితే ఈ సీన్స్‌ను మొదట బీదర్‌లో చేయాలనుకున్నారు.

షూటింగ్‌ కోసం అక్కడకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు జరగడం అన్ని జరిగాయి.కాని షూటింగ్‌ కు బీదర్‌ స్థానికులు అడ్డు చెప్పడంతో అక్కడ నుండి వెనక్కు తిరిగి వచ్చారట.

Advertisement

చిరంజీవి అండ్‌ టీం కొన్ని రోజుల క్రితం బీదర్‌ షూటింగ్‌ నిమిత్తం వెళ్లినట్లుగా తెలుస్తోంది.అక్కడ అన్ని అనుమతులు తీసుకుని షూటింగ్‌కు సిద్దం అయ్యారు.స్థానికంగా కూడా కొందరి నటీనటులను తీసుకున్నారు.

షూటింగ్‌ అంతా ప్రారంభం అయిన తర్వాత స్థానిక ముస్లీం యువకులు వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారట.సైరా చిత్రం షూటింగ్‌ కోసం నటీనటులు వేసుకున్న కాస్ట్యూమ్స్‌ ముస్లీంల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని స్థానిక ముస్లీం యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

షూటింగ్‌ జరిపేందుకు ఒప్పుకోలేదు.దాంతో షూటింగ్‌ను నిలిపేశారట.

అక్కడ వారం రోజుల పాటు చేయాలనుకున్న షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసుకుని వచ్చి హైదరాబాద్‌ కోకాపేటలో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.చిత్రానికి సంబంధించిన సీన్స్‌ కోకా పేటలో షూట్‌ చేస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, అభిషేక్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

వచ్చే దసరా కు ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు