లాక్ డౌన్ సమయం లో స్వీటీ అలా మారిపోయిందేంటీ...

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు "పూరి జగన్నాథ్" దర్శకత్వం వహించిన "సూపర్" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా హీరోయిన్ గా పరిచయమైన స్వీటీ అలియాస్ "అనుష్క శెట్టి" గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే అనుష్క శెట్టి సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో కొంతమేర సినిమా అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, రవి తేజ, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

దీంతో ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది.అయితే తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే అనుష్క శెట్టి ఈ లాక్ డౌన్ సమయంలో కొంత మేర బరువు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.అయితే ఎప్పుడు యోగ మరియు ఆహారపు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి అనుష్క శెట్టి ఒక్కసారిగా బరువు పెరిగినట్లు కనిపించడంతో ఈ అమ్మడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే మరోపక్క అనుష్క టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోందని కూడా తన వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు అనుష్క మాత్రం తన పెళ్లిపై వినిపిస్తున్న వార్తల గురించి మాత్రం స్పందించడం లేదు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది ఈ అమ్మడు "నిశబ్దం" అనే చిత్రంలో ప్రధాన నాయికగా నటించింది.దీంతో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో విడుదల చేశారు.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో తాజాగా ఈ అమ్మడు ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అయినప్పటికీ ప్రస్తుతం "కరోనా వైరస్" కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా నిలిపివేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు