జూనియర్ ఎన్టీఆర్ మూవీ పాట విషయంలో బాధపడ్డాను.. థమన్ కీలక వ్యాఖ్యలు?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఈ సినిమాల సక్సెస్ వల్ల థమన్ కు సినిమా ఆఫర్లు సైతం భారీగా వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న మెజారిటీ భారీ బడ్జెట్ సినిమాలకు థమన్ సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే.పదికి పైగా సినిమాలకు ఒకే సమయంలో మ్యూజిక్ అందిస్తూ థమన్ బిజీగా ఉన్నారు.

మరోవైపు థమన్ పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.అయితే థమన్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకున్న ఒక పాట మాత్రం నిరాశ పరిచిందని తాజాగా థమన్ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలోని కోసం తాను ఎంతో కష్టపడ్డానని థమన్ వెల్లడించారు.

Advertisement

ఆ పాట కొరకు వైజాగ్ నుంచి నికిత అనే అమ్మాయిని ప్రత్యేకంగా పిలిపించి పాడించానని థమన్ చెప్పుకొచ్చారు.యాడబోయినాడో పాటకు ట్యూన్ చేయడం కానీ, పాడటం కానీ ఎంతో కష్టమని థమన్ వెల్లడించారు.ఆ పాట కచ్చితంగా హిట్ అవుతుందని భావించి ఎంతో కష్టపడి కంపోజ్ చేశానని థమన్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ పాట తనను ఎంతగానో నిరాశపరిచిందని థమన్ అన్నారు .

అరవింద సమేత సినిమాలోని ఇతర పాటలకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా ఈ పాటకు మాత్రం ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు.జీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన యాడబోయినాడో సాంగ్ కు కేవలం 12 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం గమనార్హం.ఈ పాట లిరికల్ వీడియోకు కేవలం 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

పాట బాగున్నా తక్కువ వ్యూస్ రావడం వల్లే థమన్ ఇలా చెప్పి ఉంటారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు