శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త ఫ్యామిలీస్ అడ్డా అయ్యింది

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కి వారం వారం రేటింగ్ పెరుగుతూ వస్తుంది.కేవలం టీవీలో రేటింగ్ పెరగడం మాత్రమే కాకుండా యూట్యూబ్ లో షో కు సంబంధించిన వ్యూస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి.

 Sridevi Drama Company Latest News ,sridevi Drama Company, Promo, Ram Prasad , Fa-TeluguStop.com

సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ఈ కామెడీ షో కి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక హైపర్ ఆది రాంప్రసాద్ కలిసి చేసే కామెడీ షో కి సంబంధించిన రేటింగ్ అమాంతం పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

ఈ మధ్య కాలం లో శ్రీదేవి డ్రామా కంపెనీ కి వరుసగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం పరిపాటి అయింది.అంతకు ముందు ఏదైనా ప్రత్యేక సందర్భం లో లేదా ఏదైనా ప్రత్యేక సమయం లో మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకు వచ్చే వారు.

కానీ ఇప్పుడు సమయం సందర్బం లేకుండా మొత్తం ఫ్యామిలీ ని ఎపిసోడ్ కి తీసుకురావడం జరిగింది.

వచ్చే ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో రాంప్రసాద్ కి చెందిన మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాజరు కాబోతున్నారు.

అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏకంగా బస్సు కట్టించుకుని ఊరు నుంచి వచ్చేసారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

రాంప్రసాద్ మీ కుటుంబ సభ్యులను ఇప్పుడు ఎందుకు షో కి తీసుకు వచ్చినట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు మాత్రం ఇది షో కు సంబంధించిన పబ్లిసిటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఏదో ఒకటి చేయడం ద్వారా మంచి పాపులారిటీని షో కి హైపర్ ఆది మరియు రామ్ ప్రసాద్ లు తీసుకు వస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రేక్షకులకు ఏం చేసినా పర్వాలేదు.ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలు అన్నట్లుగా వారు ఆలోచిస్తున్నారు.అందుకే వరుసగా కుటుంబ సభ్యులను తీసుకు వచ్చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube