కేజీఎఫ్ 3 ట్రోల్స్... నీవు దేవుడివి ప్రశాంత్ నీల్‌

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వచ్చిన కేజీఎఫ్ రెండు పార్ట్‌ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండవ పార్ట్‌ వసూళ్లు రెట్టింపు వచ్చాయి అనడంలో సందేహం లేదు.

సునాయాసంగా అయిదు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్ 2 సినిమా తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు వందల కోట్ల వసూళ్లు అంటే కేజీఎఫ్ ను ఏ రేంజ్ లో జనాలు ఆధరిస్తున్నారో అర్థం అవుతుంది.

దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క దిద్దుకోవాలి.అలాగే అవకాశం ఉన్నప్పుడు అంది పుచ్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మూడవ పార్ట్‌ కూడా ఉందంటూ ప్రకటించాడు.

మొదటి పార్ట్‌ లో కథ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే.రెండవ పార్ట్‌ లో కథ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు గంట గంటన్నర సమయం పట్టింది అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.

Advertisement

ఇక మూడవ సినిమా వస్తే దాంట్లో కథ గురించి వెదకాల్సిన అవసరం లేదు.కథ లేకుండానే సినిమాను తీయగల సమర్థుడు ప్రశాంత్‌ నీల్‌.

.ఆయన కథ లేకుండా వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంటున్న దేవుడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రశాంత్‌ నీల్ పై కామెంట్స్ వస్తున్నాయి.

ఇంత భారీగా ఎత్తున వసూళ్లు దక్కించుకుంటున్న కేజీఎఫ్ లో ఎంత కథ ఉందో అని ప్రతి ఒక్కరు భావిస్తారేమో.కాని ఆ సినిమా చూసిన వారికి అసలు విషయం అర్థం అవుతుంది అంటూ మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

హీరో పాత్ర ఎలివేషన్‌ మరియు మాస్ సన్నివేశాలు యాక్షన్‌ సన్నివేశాలు.ఈమూడు తో సినిమా అయిదు వందల కోట్లు రాబట్టింది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

కేజీఎఫ్ 3 లో కూడా ఇవే ఉంటే చాలు అన్నట్లుగా కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు