కరోనా వైరస్.మనుషులను చంపేస్తుంది, అనారోగ్యవంతులను చేస్తుంది బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్కు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి అని అందరూ పదే పదే చెప్పిన ఎంతోమంది పట్టించుకోవడం లేదు.
కరోనా వైరస్ వచ్చిన పోతుందిలే, పెద్ద వైరస్ ఏం కాదు అన్నట్టు ఈ కాలం ప్రజలు వ్యవహరిస్తున్నారు.
అయితే కరోనా వైరస్ కు కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా బలవుతున్నాయి.
జంతువులకు కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జగిత్యాలలో పాములు పెంచే ఓ వ్యక్తి ప్రజలకు మాస్కులు ధరించండి ధరించండి అని చెప్పి అలసిపోయాడు.
దీంతో తన పాముకే మాస్కు వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించాడు.అంతే వెంటనే తన పాముకు ఫేస్ మాస్కు వేసేశాడు.ఇంకేముంది ఆ పాములు ఆటాకు కూడా మంచి గిరాకీ పెరిగిందట.అది చూసిన కొందరు దాని ఫోటోలు షేర్ చేస్తూ ఆ పామును చూసి అయినా ఫేస్ మాస్క్ ధరించండి అంటూ క్యాప్షన్ పెట్టారు.
దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం, పైడిమడుగులో చోటు చేసుకుంది.