మారిన కార్తీకదీపం క్లైమాక్స్.. ఆమె చనిపోతుందట..?

బుల్లితెర సీరియళ్లలో ఎన్ని సీరియళ్లు ఉన్నా కార్తీకదీపం సీరియల్ ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.

గతంలో ఏ సీరియల్ సాధించని స్థాయిలో పాపులారిటీని కార్తీకదీపం సీరియల్ సొంతం చేసుకుంది.

ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.ఆ ఫ్యాన్స్ లో చాలామంది వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను అమితంగా ఇష్టపడతారు.

ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ లో చాలామంది భావిస్తున్నారు.అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మలయాళం సీరియల్ కు రీమేక్ అయిన ఈ సీరియల్ లో క్లైమాక్స్ ను మార్చనున్నారని తెలుస్తోంది.మలయాళం సీరియల్ లో మౌనిత హిమను చంపేయడంతో పాటు హీరోయిన్ రోల్ చనిపోతుంది.

Advertisement

అయితే ఇక్కడ మాత్రం హీరోయిన్ రోల్ కు బదులుగా వంటలక్క అత్త పాత్ర పోషిస్తున్న సౌందర్య చనిపోతుందని తెలుస్తోంది.

సౌందర్య పాత్ర చనిపోయిన తరువాత డాక్టర్ బాబు వంటలక్క కలుస్తారని ఈ ఏడాది చివరకు ఈ సీరియల్ ముగిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తూ ఉండటంతో స్టార్ మా ఛానెల్ కూడా ఈ సీరియల్ ను కొనసాగించడానికే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.ఈ సీరియల్ క్లైమాక్స్ కోసం అభిమానుల్లో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.

మరోవైపు ఈ సీరియల్ కు టీఆర్పీ రేటింగ్ ల విషయంలో అదే ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్మి సీరియల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ ల నటన కార్తీకదీపం సీరియల్ సక్సెస్ కు కారణమని చెప్పవచ్చు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు