ముడుపులు చిక్కుల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య స్టార్ట్ అయిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ షో అప్పుడే కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంది.

షోలో పాల్గొన్న మ‌మైత్‌ఖాన్ డ్ర‌గ్స్ ఉదంతంలో చిక్కుకోవ‌డంతో ఓ వివాదం రాగా ఇప్పుడు ఈ షోపై క‌మీష‌న్లు, భారీ ముడుపుల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎంతో అట్ట‌హాసంగా ఆదివారం ప్రారంభ‌మైన ఈ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్ హిట్ అయితే.కంటెస్టెంట్స్ మాత్రం ప్లాప్ అన్న టాక్ వ‌చ్చేసింది.

ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల‌లో మ‌ధుప్రియ‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్‌, క‌త్తి మ‌హేష్‌, క‌త్తి కార్తీక లాంటి వాళ్ల ఎంపిక‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ఇక ఈ గెస్టుల ఎంపిక‌లో భారీగా క‌మీష‌న్లు చేతులు మారిన‌ట్టు తెలుస్తోంది.షోలో పాల్గొన్న వారికి వారి రేంజ్‌ను బ‌ట్టి రోజుకు రూ.25 వేల నుంచి రూ.75 వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని తీసుకువ‌చ్చార‌ట‌.అయితే ఈ ఎంపిక చేసిన పార్టిసిపెంట్స్‌లో చాలామంది ఎన్టీఆర్ బిగ్ బాస్ రేంజ్‌కు త‌గ‌ని వార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

వీరి ఎంపిక‌లో కొంద‌రు స్టార్ మా ఛానెల్ సిబ్బంది భారీగా క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తిప‌డి వీరిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.ముందుగా బ‌డ్జెట్ విష‌యంలో స్టార్ మా ఛానెల్ త‌గ్గిందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మైనా చివ‌ర‌కు ఈ ముడుపుల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.కొంత‌మంది వీక్ క్యాండెట్ల ఎంపిక‌లో కీ రోల్ పోషించిన స్టార్ మా సిబ్బంది వాళ్ల రెమ్యున‌రేష‌న్ నుంచి భారీగా క‌మీష‌న్లు నొక్కేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ? ఎంపిక చేసిన కంటెస్టెంట్ల‌ను చూస్తే మాస్తం చాలా సందేహాలు, అనుమానాలే వ‌స్తున్నాయి.

ఎన్నికల ప్రచారం చివరి రోజు సీఎం జగన్ ప్రచార షెడ్యూల్..!!
Advertisement

తాజా వార్తలు