ఖమ్మం కార్పొరేషన్‌ పోరులో కాంగ్రెస్‌ కు షాక్‌.. ?

తెలంగాణ రాష్ట్రంలో మినీపుర పోరుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుందన్న విషయం తెలిసిందే.ఒకవైపు కోవిడ్ విజృంభిస్తున్న పార్టీ ప్రచారమే, ఎన్నికల్లో విజయమే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లుతున్నాయి.

 Shock To Congress In Khammam Corporation Elections , Khammam, Corporation War, S-TeluguStop.com

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటి, లింగోజి గూడ సహా ఇతర ప్రాంతాల్లో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది.కాగా ఇదే నెల చివరన అంటే 30వ తారీఖున పోలింగ్ నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌లో పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది.తాజాగా 18వ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అయినాల పద్మ కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరింది.

దీంతో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది.అయితే ఇక్కడ సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఇదివరకే మరో డివిజన్‌ను సొతం చేసుకున్న విషయం తెలిసిందే.

మొత్తానికి టీఆర్‌ఎస్‌ తన ఎత్తులతో ప్రణాళిక బద్దంగా దూసుకుపోతుందని అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube