దిగివస్తున్న బాలీవుడ్ స్టార్స్.. ఏకంగా మన సీరియల్స్ ను ప్రమోట్ చేస్తూ..

తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.

అయితే గత కొంత కాలంగా అంతా మారిపోయింది.

ఇది వరకు ఇండియన్ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే అని ముద్ర పడిపోయింది.కానీ బాహుబలి తర్వాత మన జక్కన్న అంతా మార్చేశాడు.

ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలకు ప్రేక్షకులు ఎలా ఫిదా అవుతున్నారో రాజమౌళి ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు.

బాలీవుడ్ ప్రముఖులే వారి ఇండస్ట్రీ గురించి తీస్తున్న సినిమాల గురించి విమర్శలు గుప్పిస్తున్న వేళ బాలీవుడ్ కళ్ళు తెరిచింది.దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించినప్పుడే మళ్ళీ బాలీవుడ్ సినిమాలకు మంచి రోజులు వస్తాయని అక్కడి స్టార్స్ కు లేటుగా అర్ధమైంది.

Advertisement

దీంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై కన్నేశారు.ఇక్కడ వారు నటించే సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు.తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం ఈయన చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది బాలీవుడ్ వారు మన ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు.

మన సౌత్ ప్రేక్షకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఏకంగా మన తెలుగు సీరియల్ ను ప్రమోట్ చేస్తూ షారుఖ్ కనిపించడం అందరికి షాక్ ఇస్తుంది.

పఠాన్ సినిమా జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ్ లో కూడా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బెట్టు వీడి మరీ షారుఖ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు.మన తెలుగులో ప్రముఖ ఛానెల్ లో త్వరలో ప్రసారం కానున్న బ్రహ్మముడి సీరియల్ కు ప్రచారం చేస్తూ పఠాన్ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.గతంలో ఏ బాలీవుడ్ స్టార్ కూడా ఇలా తెలుగు సీరియల్ కు ప్రమోట్ చేయడం జరగలేదు.

చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ మెట్టుదిగి వచ్చినట్టే తెలుస్తుంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు