రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై సోనియా గాంధీ నివాసంలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.రాజస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులపై ప్రియాంకా గాంధీ.
సోనియాతో చర్చిస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కమల్ నాథ్ లు సోనియాతో చర్చలు జరిపారు.
అనంతరం ప్రస్తుత పరిణామాలపై నివేదిక అందించారు.నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గే, అజయ్ లు తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాజస్థాన్ సీఎంపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు.