శేఖర్ మాస్టర్ కూతురు సాహితి డ్యాన్స్ అదుర్స్.. నెట్టింట్లో వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే ఇంస్టాగ్రామ్ రీల్స్ నడుస్తున్నాయని చెప్పవచ్చు.

టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో వీడియోలను చేస్తూ వారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఎంత మంది హీరోయిన్లు బుల్లితెర నటులు షూటింగ్ సమయంలో ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.ఈ మధ్య కాలంలో పుష్ప సినిమాలోని రారా స్వామి.

, సమంత ఐటమ్ సాంగ్ కొన్ని వేల సంఖ్యలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా వీడియోలను చేశారు.ఈ క్రమంలోనే తాజాగా అనుపమ నటించిన రౌడీ బాయ్స్ చిత్రంలోని బృందావనంలో కృష్ణుడు వచ్చాడే అనే పాట కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ పాటకు ఎంతో మంది అమ్మాయిలు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ పాటపై అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ ఎంతో అద్భుతమైన కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ కు ఇలాంటిమంచి పాటను తనకు ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ గురించి మనకు తెలిసిందే.సాహితీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ వీడియోని అనుపమ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఇలా సాహితీ చేసిన డ్యాన్స్ వీడియోని అనుపమ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో పై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ అడోరబుల్ అంటూ కామెంట్ చేశారు.

అదేవిధంగా అనుపమ పరమేశ్వరన్ క్యూట్ అంటూ కామెంట్ చేయడంతో సాహితీ థాంక్స్ అంటూ స్పందించారు.మొత్తానికి సాహితీ వేసిన ఈ స్టెప్పులకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు