డబ్బు కోసం తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని.... కూతురు ఏకంగా...

ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు కోసం తీసుకున్న నిర్ణయాలు తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

తాజాగా ఓ విద్యార్థిని తన తల్లి డబ్బు కోసం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ మండలంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే సుధ (పేరు మార్చాం) అనే ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటోంది.అయితే సుధ తల్లి దండ్రులు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో సుధ చదువుతోంది.అయితే ఇటీవలే సుధా తల్లి గ్రామంలో పెద్ద మనిషి గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధ తల్లి తన ప్రియుడితో ఏకాంతంగా కలుసుకునేది.  అనంతరం అతడు ఇచ్చిన డబ్బుతో కుటుంబ పోషణకు కావాల్సిన పనులకు ఉపయోగించేది.

Advertisement

దీంతో కొంత కాలం తరువాత వీరిద్దరి అక్రమ సంబంధం విషయం బట్టబయలు అయింది.చివరికి ఈ నోటా ఆ నోటా పాకుతూ తన తల్లి అక్రమ సంబంధం విషయం సుధ కి తెలిసింది. దీంతో ఆమె స్నేహితులు కూడా తన తల్లి గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండటం విని తట్టుకోలేక పోయింది.

దీంతో ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.డబ్బు కోసం తన తల్లి చేసిన పనికి నిండు విద్యార్థిని జీవితం బలైంది.

దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు