సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
పరశురామ్ సామజిక అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.
అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.రీసెంట్ గా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి కరోనా కారణంగా వాయిదా పడింది.
కరోనా తగ్గుముఖం పడితే కానీ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టరు.ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు.అయితే ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలో ఒక అభిమాని ప్రశ్నించాడు.ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా స్వప్నిక అనే యువ నటి పనిచేస్తుంది.
తాజాగా ఈమె సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా టీజర్ గురించి స్పందించింది.సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ‘సర్కారు వారి పాట టీజర్ మే 31 న విడుదల అవుతుందని మేము ఆశించవచ్చా.‘ అని ప్రశ్నించాడు.
అందుకు ఆమె స్పందిస్తూ.
చేయొచ్చేమో అని సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎందుకంటే ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు.
అందుకే ఈ సినిమా టీజర్ అదే రోజు రాబోతుందంటూ ఆమె హింట్ ఇచ్చినట్టు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.