పుష్ప, కేజీఎఫ్2 సినిమాలను దాటేసిన మహేష్ సర్కారు వారి పాట.. కానీ?

గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో పుష్ప ది రైజ్ ఒకటి కాగా ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో కేజీఎఫ్2 ఒకటి కావడం గమనార్హం.

అయితే ఈ సినిమాలు ఉత్తరాంధ్ర ఏరియాలో సాధించిన కలెక్షన్లను సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే దాటేయడం గమనార్హం.

ఉత్తరాంధ్ర ఏరియాలో సర్కారు వారి పాట సినిమా స్ట్రాంగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ఫుల్ రన్ లో ఈ సినిమా ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు భారీ రికార్డును సెట్ చేస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

నెగిటివ్ టాక్ తో కూడా సర్కారు వారి పాట సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తున్నాయని తెలుస్తోంది.ఉత్తరాంధ్రలో సర్కారు వారి పాట తొలిరోజు 3.27 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా రెండో రోజు కోటి 54 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.మూడో రోజు ఈ సినిమా కోటీ 55 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్లు 9.23 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు ఏకంగా 87.55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.మరో 33 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

Advertisement

టార్గెట్ చిన్నదే అయినా ఈరోజు నుంచి సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

కీర్తి సురేష్ కు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరింది.సర్కారు వారి పాట సినిమా ఎన్నో నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు ఖాతాలో మరో సక్సెస్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Advertisement

తాజా వార్తలు