పవన్ వేదాలం రీమేక్ కి డైరెక్టర్ సూర్య కాదు

ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఎస్.

జే.సూర్యతో సినిమా ఉంటుందని, ఖుషి లాంటి సినిమా లేదా వేదాలం రీమేక్ కి సూర్య దర్శకత్వం వహిస్తాడని అన్నారు.

తదుపరి చిత్రమెనో కాదో తెలియదు కాని, సూర్యతో సినిమా ఉంటుంది.కాని అది వేదాలం రీమేక్ కాదు.అలాగని వేదాలం రీమేక్ ని పవన్ క్యాన్సిల్ కూడా చేసుకోలేదు.

వేదాలం రీమేక్ ఉంటుంది , అది సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుంది.ఆశ్చర్యపోనక్కరలేదు .కందిరీగ, రభస చిత్రాలు తీసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాన్ ని డైరెక్ట్ చేయనున్నాడు.

Advertisement
గత సంవత్సరం విడుదలై తమిళ నటుడు అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వేదాలం రీమేక్ కన్ఫర్మ్ అయిపొయింది.

సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఇదే సినిమా మొదలవోచ్చు.ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ వేదాలంని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు.ఈ చిత్రాన్ని కూడా పవన్ కళ్యాన్ మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తారని సమాచారం.

అంత పెద్ద స్టార్ అయ్యుండి, సంతోష్ శ్రీనివాస్ లాంటి యువ దర్శకుడికి పవన్ అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయం.మరి రభసతో ఎన్టీఆర్ ను డిజపాయింట్ చేసిన సంతోష్, పవన్ కళ్యాన్ తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకుంటాడా, వేదాలంకి మించిన హిట్ పవర్ స్టార్ కి అందిస్తాడా లేదా చూడాలి.

ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Advertisement

తాజా వార్తలు