టాలీవుడ్ ఇండస్ట్రీలోను సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి ఒకరు కాగా చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.బేబీ సినిమాకు సాయి రాజేష్ డైరెక్టర్ కాగా చిరంజీవి అభిమాని అయిన సాయి రాజేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
జై చిరంజీవ( Jai Chiranjeeva ) ఆడియో ఫంక్షన్ సమయంలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నానని సాయి రాజేష్ తెలిపారు.స్టాలిన్ సమయంలో లోపలి వరకు వచ్చానని మా అవార్డ్స్ సమయంలో ఒకే వరుసలో కూర్చున్నానని ఆయన కామెంట్లు చేశారు.
ఇప్పుడు చిరంజీవి( Chiranjeevi ) పక్కన కూర్చున్నానని ఆయన అన్నారు.చిరంజీవి పాత బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇచ్చానని బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని పిలవాలని అనుకుంటే ఆయన అమెరికాకు వెళ్లారని చిరంజీవి గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదని సాయి రాజేశ్ పేర్కొన్నారు.
![Telugu Baby, Bank, Chiranjeevi, Jai Chiranjeeva, Sai Rajesh, Tollywood-Movie Telugu Baby, Bank, Chiranjeevi, Jai Chiranjeeva, Sai Rajesh, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/sai-rajesh-Vaishnavi-Chaitanya-baby-movie-Blood-Bank-Chiranjeevi.jpg)
మేము అనుకుంటే అన్నయ్యకు తెలిసిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి గారు దురదృష్టవంతులు అని చిరంజీవి ఫ్యాన్స్ కు ఉండే లక్ చిరంజీవికి ఉండదని సాయి రాజేశ్ అన్నారు.కష్ట సుఖాలున్నా, బాధలున్నా, పారాసెట్మాల్, మ్యాన్షన్ హౌన్ అన్నీ మీరేనని సాయి రాజేశ్ వెల్లడించారు.కోట్ల మంది అభిమనులకు చిరంజీవి దేవుడు అని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.
![Telugu Baby, Bank, Chiranjeevi, Jai Chiranjeeva, Sai Rajesh, Tollywood-Movie Telugu Baby, Bank, Chiranjeevi, Jai Chiranjeeva, Sai Rajesh, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/sai-rajesh-tollywood-Vaishnavi-Chaitanya-baby-movie-Blood-Bank-Chiranjeevi.jpg)
బేబీ తర్వాత సాయి రాజేశ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.బేబీ సినిమా సక్సెస్ తో చాలామంది హీరోలు సాయి రాజేశ్ డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సాయి రాజేశ్( Sai rajesh ) ను అభిమానించేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.సాయి రాజేశ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.భవిష్యత్తులో చిరంజీవి సాయి రాజేశ్ కాంబినేషన్ లో సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.