25 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్... క్లారిటీ ఇచ్చిన తలైవి టీమ్

సౌత్ ఇండియా దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ రోజాని ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు.అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా దీనిని మణిరత్నం సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

భార్యాభర్తల బంధంలోని గొప్పతనాన్ని తెరపై హృద్యంగా చూపించారు.25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, మధుబాల హీరో హీరోయిన్స్ గా నటించారు.రోజా సినిమాతో వీళ్ళ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

మధుబాల స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అరవింద్ స్వామికి కూడా అదే స్థాయిలో ప్రేమకథా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

అయితే ఆ సినిమా తర్వాత మధుబాల, అరవింద్ స్వామి కెరియర్ లో గుర్తించుకొదగ్గ పాత్రలు అయితే చేయలేకపోయారు.ఓ విధంగా చేయలేకపోయారు అనేకంటే రోజా సినిమాలో వారి పాత్రల ప్రభావం ఇతర సినిమాలు కనిపించకుండా చేసేశాయి అని చెప్పాలి.

అప్పట్లో రోజా సినిమా ఒక ట్రెండ్ సెట్టర్.ఇదిలా ఉంటే 25 ఏళ్ల క్రితం వెండితెరపై సందడి చేసిన ఈ జంట మళ్ళీ ఇప్పుడు జత కట్టబోతున్నారు.

Advertisement

జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న తలైవి సినిమాలో వీరిద్దరూ భార్యభార్తలుగా కనిపించబోతున్నారు.అరవింద్ స్వామి ఈ సినిమాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో కనిపించబోతుండగా అతని సతీమణి జానకమ్మ పాత్రలో మధుబాల నటిస్తుంది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.ఈ సందర్భంగా సినిమాలో నటించడంపై మధుబాల రోజా సినిమా చేసినప్పుడు రాష్ట్రప్రభుత్వం అవార్డు తీసుకునే సందర్భంలో జయలలితను కలిశాను.

ఆమె నా నటనను ప్రశంసించారు.కానీ జానకమ్మను నేను ఎప్పుడూ కలవలేదు.

ఆ పాత్ర కోసం దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చాలా పరిశోధన చేశారు.జానకమ్మ పాత వీడియోలను చూసి ఆమె భంగిమలు, హావభావాలను అనుకరించాలి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఒక వ్యక్తి పాత్రను తెరపై పోషించాలంటే చాలా కష్టపడాలి.ప్రతి చిన్నవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మధుబాల చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు