పాయల్ పై పరువు నష్టంకి రెడీ అవుతున్న రిచా చద్దా

బాలీవుడ్ లో తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద నటి పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వాఖ్యలతో మరల బాలీవుడ్ లో మీటూ రచ్చ మొదలైంది.

అయితే పాయల్ అనురాగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు అందులోకి ముగ్గురు హీరోయిన్స్ పేర్లు కూడా లాగింది.వాళ్ళు అనురాగ్ తో సన్నిహితంగా ఉంటారని ఆమె చెప్పింది.

అయితే ఈ విషయంలో నెటిజన్లు నుంచి పాయల్ కి మద్దతు లభిస్తున్న, ఇండస్ట్రీలో చాలా మంది అనురాగ్ కశ్యప్ కి అండగా నిలబడుతున్నారు.చాలా మంది హీరోయిన్స్ తో పాటు అనురాగ్ మాజీ భార్యలు కూడా అతను వ్యక్తిత్వానికి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు.

అయితే అనురాగ్ మీద విమర్శలు చేసే క్రమంలో తన పేరుని పాయల్ ఘోష్ ఉపయోగించడంపై నటి రిచా చద్దా అభ్యంతరం వ్యక్తం చేసింది.త‌న‌ను ఈ వివాదంలోకి లాగ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది.

Advertisement

త‌న పేరు వాడిన మూడో వ్య‌క్తిపై త్వ‌ర‌లో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆమె హెచ్చ‌రించారు.ఈ మేరకు ఆమె త‌ర‌పు లాయ‌ర్ సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడ‌డం ర‌చ్చ‌కు దారి తీస్తోంది.తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు.

వారిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్న‌ట్టు ఆమె తెలిపారు.అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడో వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్‌ రిచా చద్దా పేరు తీసుకొచ్చారు.

ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి.అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు అని చద్దా తరపు లాయ‌ర్‌ అన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మరి ఈ పాయల్ ఘోష్ రేపిన చిచ్చు బాలీవుడ్ లో ఎంత దుమారం రేపుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు