కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు.బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలేతర మినహా పార్టీలు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
పెట్రోల్, డీజిల్.అదే రీతిలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ నేతలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.మోడీ, కేసీఆర్ లపై కామెంట్స్ చేయటం జరిగింది.
తెలంగాణలో అవినీతి కేంద్రానికి కనబడటం లేదా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇటువంటి అవినీతి చేసే నాయకుడిని తోడు కూర్చోబెట్టుకొని మద్దతు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు.మోడీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు అని.తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతిలో బలైపోయింది అని పేర్కొన్నారు.ఢిల్లీలో ఉన్న మోడీ గల్లీలో ఉన్న ఈ కేడి ఇద్దరు తోడు దొంగలే అని. సంచలన డైలాగులు వేశారు.దేశాన్ని ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారుల కోసం నాశనం చేస్తున్నారు అంటూ కేంద్రంపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.