జూలై 30 న రైతు రుణమాఫీ రెండవ విడత విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ( Rythu Runa Mafi ) రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జూలై 30న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.

రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది సహకార శాఖ సిబ్బంది బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సీపీఆర్ పై అందరికీ అవగాహన ఉండాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News