ఇండియాలోనే అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో రజినీకాంత్( Hero Rajinikanth )…ఈయన తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడం లో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.ఇక ఇప్పటికి కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని సంతోషపరుస్తు ఉంటాడు.
దాదాపు 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్న కూడా రజినీకాంత్ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఆయన హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోయిన కూడా కేవలం తన అభిమానులను ఆనందపరచడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ చాలా మంది దర్శకులతో సినిమాలు చేశాడు.కానీ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ఆయన కూతుళ్ళు చేసిన మూడు సినిమాలు మాత్రం ఆయన్ని తీవ్రంగా దెబ్బ కొట్టాయి.అందులో మొదటిది ధనుష్ హీరోగా వచ్చిన త్రీ సినిమా( Three Movie )…

ఈ సినిమాకి డైరెక్టర్ గా ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth ) వ్యవహరించారు.అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు.దానిని భర్తీ చేయడానికి రజినీకాంత్ రంగంలోకి దిగి మరి ఆయనే సొంతంగా తన డబ్బులను వాళ్లకు తిరిగి చెల్లించడం విశేషం.
ఇక ఇది ఇలా ఉంటే ఆయన ఇంకో కూతురు అయిన సౌందర్య రజనీకాంత్( Soundarya Rajinikanth ) మొదటి సారిగా ఇండియా లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని వాడుకొని రజినీకాంత్ ను హీరో గా పెట్టీ ‘కొచ్చాడియాన్ ‘( Kochadaiyaan ) అనే సినిమాని తెరకెక్కించింది.ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.
దాంతో రజనీకాంత్ భారీగా నష్టపోయాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన లాల్ సలాం సినిమా( Lal Salaam ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో కాకపోయినప్పటికీ ఒక మంచి పాత్రలో నటించి మెప్పించాడు.అయినప్పటికీ ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా( Disaster ) మిగిలింది.ఇక ఇప్పుడు రజినీకాంత్ తన కూతుళ్లను నమ్ముకొని చాలా వరకు నష్టపోయాడు.కాబట్టి ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకూడదని ఆయన అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…మొత్తానికైతే ఇక మీదట ఆయన చేసే సినిమాల విషయం లో రజినీ కాంత్ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని ఆయన అభిమానులు కూడా చెప్తున్నారు…
.