ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్న రష్మిక మొదటి తమిళ్ సినిమా

టాలీవుడ్ ప్రస్తుతం మంచి బూమ్ లో ఉన్న కథానాయిక అంటే వెంటనే రష్మిక మందన పేరు వినిపిస్తుంది.

వరుస హిట్ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు అగ్రకథానాయికగా మారిపోయింది.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు, శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది.ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇక కన్నడ, తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన రష్మిక తమిళంలో కూడా కార్తీకి జోడీగా సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ కూడా మిషన్ మజ్ను సినిమాతో కన్ఫర్మ్ అయ్యింది.ఇక బాలీవుడ్ లో మరో సినిమా కూడా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మికకి సంబందించిన మరో హాట్ టాపిక్ వైరల్ అవుతుంది.రష్మిక తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సుల్తాన్ మూవీ ఇప్పుడు ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఖైదీ సినిమా తర్వాత కార్తీ నటించిన చిత్రం ఇచ్చే.దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉంటే థియేటర్లు ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.ఈ నేపధ్యంలో ప్రేక్షకుల నుంచి కూడా అనుకున్న స్థాయిలో స్పందన ఉండటం లేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

దీంతో థియేటర్ లో రిలీజ్ చేస్తే రిస్క్ పేస్ చేయాల్సి ఉంటుంది.అలా కాకుండా డిజిటల్ చానల్స్ ఇస్తున్న భారీ ఆఫర్ కి ఒకే చెబితే ఎలాంటి నష్టాలు లేకుండా సేఫ్ జోన్ లో బయటపడొచ్చు అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

Advertisement

ఈ నేపధ్యంలో థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు