వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న రంభ... ఆర్ ఎక్స్ దర్శకుడుతో

ప్రస్తుతం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా మొదలైంది.సినిమాల కంటే ఆన్ లైన్ డిజిటల్ వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం కరోనా సిచువేషన్ వలన సినిమాలు తెరకెక్కించలేని పరిస్థితి నెలకొని ఉంది.ఈ నేపధ్యంలో తక్కువ క్యాస్టింగ్ తో, తక్కువ బడ్జెట్ తో ఫినిష్ అయిపోయే వెబ్ సిరీస్ లపై క్రేజ్ పెరిగింది.

దీంతో హీరోయిన్స్, ఫేడ్ అవుట్ హీరోలు, దర్శకులు అందరూ వెబ్ సిరీస్ ల మీద పడ్డారు.అలాగే వెటరన్ స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల ద్వారా మరల రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ వరుసలో సిమ్రాన్ లాంటి హీరోయిన్స్ కూడా వచ్చి చేరారు.ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగు అందం రంభ సిద్ధం అవుతుంది.

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ తర్వాత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది.తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలతో ఈమె ఆదిపాడింది.

అప్పట్లో ఆమె అందానికి యూత్ నుంచి విపరీతంగా ఫాలోయింగ్ ఉండేది.అయితే చాలా కాలం క్రితం పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయిన రంభ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి.

ఇక ఈమె మళ్ళీ నటిగా రీఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురుచూస్తుంది.ఈ నేపధ్యంలో ఆర్ఎక్స్ 100 దర్శకుడు తెరకెక్కించబోయే ఓ వెబ్ సిరీస్ కోసం రంభని సంప్రదించాడని, ఆమె కూడా నటించడానికి ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది.

అడల్ట్ కంటెంట్ తో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది అని సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 15, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు