నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య ఏకంగా మూడు పాత్రలలో కనిపించబోతున్నాడు.
అందులో యంగ్ లుక్ ఒకటి కాగా, రైతు పాత్ర అలాగే అఘోరా పాత్రలో కూడా బాలకృష్ణ దర్శనం ఇవ్వబోతున్నాడు.తనకి అలవాటైన యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి కాస్తా కొత్తదనం ఉంటుందని అఘోరా పాత్రని బోయపాటి జోడించినట్లు తెలుస్తుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇక సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
పూర్ణ చాలా కీలకమైన పాత్రని సినిమాలో చేస్తుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి స్టంట్ మాస్టర్స్ గా చేస్తున్న రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ఇప్పుడు తప్పుకున్నట్లు తెలుస్తుంది.
బోయపాటి సినిమా అంటే యాక్షన్ డైరెక్టర్స్ గా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉంటారు.ఈ దర్శకుడుకి పేరు వచ్చింది కూడా వారు సృష్టించిన యాక్షన్ సీక్వెన్స్ ద్వారానే.
అయితే వీటిలో కూడా బోయపాటి ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని టాక్ ఉంది.ఈ నేపధ్యంలో తాజాగా బాలకృష్ణ సినిమా నుంచి ఉన్నపళంగా ఇప్పుడు ఈ బ్రదర్స్ ఇద్దరూ తప్పుకున్నారని సమాచారం.
వారి స్థానంలో స్టంట్ శివని తీసుకున్నారని తెలుస్తుంది.అయితే వారు తప్పుకోవడానికి కారణం దర్శకుడు బోయపాటితో వచ్చిన విభేదాలే అని అని తెలుస్తుంది.
అతిగా ఇన్వాల్వ్ అవ్వడం వలన తమకి ఇబ్బందికరంగా మారుతుందని భావించి తప్పనిసరి పరిస్థితిలో సగం సినిమాలో రామ్ లక్ష్మణ్ తప్పుకున్నారని టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న హాట్ టాపిక్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy