రామ్ తో గౌతం మీనన్.. రీమేక్ మూవీ..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ది వారియర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా తర్వాత కూడా రామ్ మరో తమిళ దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రామ్ తన నెక్స్ట్ సినిమా తమిళ స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ డైరక్షన్ లో చేస్తారని తెలుస్తుంది.

రామ్ తో గౌతం మీనన్ ఓ రీమేక్ చేస్తాడని అంటున్నారు.ప్రస్తుతం శింబుతో చేస్తున్న వెందు తనిందదు కాదు సినిమానే తెలుగులో రామ్ తో రీమేక్ చేస్తాడని అంటున్నారు.

శింబు హీరోగా గౌతం మీనన్ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.గౌతం మీనన్ తన సినిమాలన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తారు.

Advertisement

కాకపోతే ఈసారి తమిళ వర్షన్ ముందు పూర్తి చేసి ఆ తర్వాత తెలుగు వర్షం తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.వెందు తనిందదు కాదు తెలుగు రీమేక్ లో రామ్ నటిస్తాడని టాక్.

ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.ది వారియర్ సినిమా జూలై 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు