అన్నా చెల్లెల బందానికి ప్రతీక రాఖీ..ప్రముఖ ఎన్ఆర్ఐ రాధారపు సత్యం

తోబుట్టిన అక్కచెల్లెళ్ళ ప్రేమ ఎంతో గొప్పది.ప్రముఖ ఎన్ఆర్ఐ రాధారపు సత్యం రాజన్న సిరిసిల్ల జిల్లా :అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని ప్రముఖ ఎన్ఆర్ఐ , ఎల్ఎస్పీఎంకే కంపెనీ అదినేత రాధారపు సత్యం( Radharapu sathyam ) అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తన ఇంట్లో ముందస్తు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

దుబాయ్ నుంచి వచ్చిన సత్యంకు తన నలుగురు తోబుట్టువులు రాఖీలు కట్టారు .అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ రాఖీ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్గో గొప్ప ఆచారమని వివరించారు.

అన్ని బంధాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పదని అన్నారు.ప్రజల మధ్య సోదరభావం మరింత దృఢంగా ఉండాలని కోరారు.

ప్రతి కుటుంబం లో ఒక అక్కనో,చెల్లెనో ఉండడం ఆ కుటుంబంలో ఎప్పుడు సందడిగా ఉంటుందని ఆయన అన్నారు.

Advertisement
మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు..

Latest Rajanna Sircilla News