యూపీ ఎన్నికలలో బిజెపి గెలవడానికి కుట్రలు చేస్తోంది అంటున్న రాకేష్ తికాయత్..!!

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలవడానికి కుట్రలు పన్నుతోంది అంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని తాలిబాన్లతో పోల్చినా తికాయత్ తాజాగా.

యూపీ ఎన్నికలలో గెలవడానికి బిజెపి కుట్రలకు పాల్పడటం కి రెడీ అవుతుందని పేర్కొన్నారు.హిందూ మతానికి చెందిన కీలక వ్యక్తిని చంపేసి మత విద్వేషాలు దేశంలో రెచ్చగొట్టడానికి బీజేపీ అతిపెద్ద ప్లాంట్ వేయడం జరిగిందని రాకేష్ తికాయత్ సంచలన ఆరోపణలు చేశారు.ఈ కుట్రకు పాల్పడి యూపీ ఎన్నికలలో గెలవటానికి బిజెపి స్కెచ్ వేసింది అని ఆరోపించారు.403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది.

ఇదిలావుంటే ఇటీవల వరుస ఓటములు బీజేపీకి రావడంతో యూపీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని భావిస్తూ ఉంది.ఈ నేపథ్యంలో భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్. మతాన్ని అడ్డం పెట్టుకుని వర్గాల మధ్య గొడవలు సృష్టించి బీజేపీ గెలవటానికి ప్లాన్ వేస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు