రాజమౌళి గారు ఇంకా ఎన్నాళ్లు ఈ సస్పెన్స్‌?

రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసిన రాజమౌళి రెండవ షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించాడు.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులతో హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్టింగ్‌లో చిత్రీకరణ జరుపుతున్నాడు.రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయిన తర్వాత సినిమాలోని హీరోయిన్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందింది.

కాని రాజమౌళి మాత్రం రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయిన తర్వాత కూడా హీరోయిన్స్‌ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రాజమౌళి ముగ్గురు హీరోయిన్స్‌ను ఈ చిత్రం కోసం ఫిక్స్‌ చేసి పెట్టాడు.ఆ హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై సస్పెన్స్‌లో పెట్టాడు.త్వరలోనే హీరోయిన్స్‌ చిత్రీకరణలో పాల్గొంటారు, అప్పుడు చూడండి అంటూ రాజమౌళి చెబుతున్నాడు.

Advertisement

ఇంకా ఎన్నిరోజులు రాజమౌళి సినిమాలో హీరోయిన్స్‌ను దాస్తాడో అంటూ సినీ వర్గాల వారు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు కనుక హీరోయిన్స్‌తో అవసరం లేదని, అందుకే వారిని ఇంకా ప్రకటించలేదేమో అంటున్నారు.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చింది.ఇక మిగిలిన ఏ విషయాల గురించి కూడా రాజమౌళి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.అసలు సినిమా కథ ఏంటీ, హీరోల పాత్రలు ఏంటీ, సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది, హీరోయిన్స్‌ ఎవరు, వారు ఎలా ఉంటారు ఇలా అనేక ప్రశ్నలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో మెదులుతున్నాయి.

వాటన్నింటికి సమాధానం దొరికేది ఎప్పుడో? .

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు