కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేరళలోని వయనాడ్( Wayanad ) నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ మేరకు వయనాడ్ కు చేరుకున్న రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు.
ఈ రోడ్ షోలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు కేరళ కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్లతో రాహుల్ గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.కాగా ఈసారి రాహుల్ గాంధీపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్( Surendran ) పోటీ చేయనున్నారు.