త్వరలో ఏపీకి రాహుల్ గాంధీ..!!

ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయనీయ పరిస్థితి లోకి వెళ్ళిపోయింది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు లేకుండా పోయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు విషయం అదే రేంజ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి విషయాలలో అటు ఇటు గా.వ్యవహరిస్తున్నట్టు విపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి.ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం.

కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.ఈ తరుణంలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మార్పునకు చర్యలు తీసుకోవడం తెలిసిందే.

ఇటువంటి తరుణంలో మూడు రాజధానులు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి.మద్దతు తెలపడానికి రాహుల్ గాంధీ త్వరలో ఏపీ లో పర్యటించడానికి రెడీ అయినట్లు సమాచారం.

Advertisement

ఇదే విషయాన్ని చింతామోహన్ ఇటీవల తెలియజేశారు.అంత మాత్రమే కాక త్వరలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

Advertisement

తాజా వార్తలు