వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఎకౌంటులో అసభ్య పదజాలంతో తోటి రాజకీయ నాయకులను దూషిస్తున్నారని రఘురామ ఆరోపించారు.
ఏపీ అపోజిషన్ లీడర్ చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి దారుణమైన భాషతో పోస్టులు పెడుతున్నారని రాజ్యసభ చైర్మన్ దృష్టికి తిసుకోచారు.
ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే ఎన్నో అసహ్యకరమైన పోస్టులు మరియు అభ్యంతరం కలిగించే అంశాలు బయటపడతాయని.
తన ఫిర్యాదులో రఘురామరాజు తెలియజేశారు.సామాజిక మద్యమాల్లో తోటి రాజకీయ నాయకులపై ఇటువంటి దిగజారుడు భాష మాట్లాడే.
విజయసాయిరెడ్డిని ఉన్నత పదవులు అయిన ప్యానల్ స్పీకర్ పదవి నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎథిక్స్ కమిటీ పదవుల నుంచి తప్పించాలని రఘురామకృష్ణరాజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ కి లెటర్ రాయడం జరిగింది.