ప్రిన్స్‌ భరతను కలిసిన పుష్ప రాజ్‌.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌

అల్లు అర్జున్‌ మరియు స్నేహా రెడ్డిలు ఇటీవలే శాకుంతలం సెట్‌ కు వెళ్లారు.అక్కడ తమ కూతురు ఎలా నటిస్తుంది అనే విషయాలను ఆసక్తిగా చూశారు.

అర్హా నటన మరియు లుక్ చూసి మురిసి పోయిన ఆ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.వెంటనే అల్లు అర్జున్‌ నుండి మరో పోస్ట్ వచ్చింది.

సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ షేర్ చేసిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్‌ కు పుష్ప సినిమా షూటింగ్‌ లో నటిస్తున్నాడు.

శాకుంతలం సినిమా షూటింగ్‌ ఎక్కడ అయితే జరుగుతుందో అక్కడే పుష్ప సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.రెండు సినిమాలు ఒకే చోట జరుగుతున్న నేపథ్యంలో తండ్రి కూతురు ఇద్దరు కూడా గెటప్ ల్లో ఉన్నారు.

Advertisement

పుష్ప రాజ్ గెటప్‌ లో ఉన్న అల్లు అర్జున్ షాట్‌ గ్యాప్‌ లో శాకుంతలం సినిమా సెట్స్ కు వెళ్లాడు.అక్కడ తన కూతురు భరతుడు గెటప్‌ లో ఉండగా ఎత్తుకున్నాడు.

ఆ ఫొటోనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.ఈ రోజు నేను నా కూతురు అర్హ ఒకే లొకేషన్‌ లో రెండు వేరు వేరు సినిమాల షూటింగ్‌ లు చేస్తున్నాము.నేను తన సెట్స్‌ కు వెళ్లాను.

ఇది 15 నుండి 20 సంవత్సరాల తర్వాత జరుగుతుందని అనుకున్నాను.కాని ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు.

ఇది జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకొచ్చాడు.ఇది ఒక అద్బుతమైన రోజు అన్నట్లుగా ఆయన ఆనందంతో పాటు ఎమోషనల్‌ అయ్యాడు.సోషల్‌ మీడియాలో ప్రస్తుతం బన్నీ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

పుష్ప రాజ్ మరియు ప్రిన్స్ భరతలను వెనుక నుండి చూశాం.ముందు నుండి చూసే రోజు ఎప్పుడు వస్తుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు