యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడుతో పూరి పాన్ ఇండియా మూవీ

ప్రస్తుతం సౌత్ హీరోలు అందరూ తమ మార్కెట్ పరిధిని విస్తరించుకునే పనిలో ఉన్నారు.ఒకప్పుడు సినిమా అంటే ప్రాంతాల బట్టి బాషల బట్టి వేరుగా ఉండేది.

అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇండియన్ మూవీ అనే ఒక బ్రాండ్ దిశగా అన్ని బాషలలో ఉన్న దర్శక నిర్మాతలు వెళ్తున్నారు.ఇప్పటికే సౌత్ లో బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ప్రస్తుతం అతని సినిమాలు అన్ని కూడా ఇండియన్ వైడ్ గా సుమారు ఏడు బాషలలో రిలీజ్ అవుతున్నాయి.ఇప్పుడు ఇదే దారిలో తెలుగు హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి స్టార్స్ అందరూ వెళ్తున్నారు.

ఇక కోలీవుడ్ నుంచి సూర్య, విజయ్, అజిత్, రజినీకాంత్ లాంటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు.ఇక శాండల్ వుడ్ నుంచి సుదీప్, ఉపేంద్ర, యష్ లాంటి హీరోలు పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు.

Advertisement

బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ మార్కెట్ మీద దృష్టిపెట్టి వారి సినిమాలని ప్రాంతీయ బాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఇప్పుడు సౌత్ లో చిన్న చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు.

ఈ నేపధ్యంలో ఇతర బాషలలో సక్సెస్ ఫుల్ దర్శకులుగా ఉన్నవారితో జత కట్టడానికి రెడీ అవుతున్నారు.స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దీని తర్వాత పూరీ మరో యంగ్ హీరోని పాన్ ఇండియా స్టార్ గా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలతో రాణిస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జాతో పూరీ నెక్స్ట్ సినిమా చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు బోగట్టా.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన చర్చలు కూడా జరిగాయని సమాచారం.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

పొగరు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని ధృవ్ సర్జా పలకరించాడు.ఇప్పుడు పూరీ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడానికి రెడీ అవుతున్నట్లు బోగట్టా.

Advertisement

తాజా వార్తలు