దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంగతి తెలిసిందే.2014వ సంవత్సరంలో మోడీ ప్రధానమంత్రి కావడం లో కీలక పాత్ర పోషించిన పీకే అనేక ఎన్నికలలో పలు ప్రధాన పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తూ .గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉందని అందరికీ తెలుసు.
అటువంటి ఎన్నికల వ్యూహకర్త పీకే కి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారుడిగా నియామకాలు ఉత్తర్వులు జారీ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
‘ప్రశాంత్ కిషోర్ ప్రధాన సలహాదారుగా నాతో చేరారు.పంజాబ్ ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా తామిద్దరం కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో వేచిచూస్తున్నామని’ పేర్కొన్నారు.
దీంతో ఈ వార్త జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.