వకీల్ సాబ్ కారణంగా సర్కారువాటి పాటకి ఎఫెక్ట్... తప్పుకున్న ఆ టెక్నీషియన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని ఇప్పటికే పూర్తయిపోయాయి.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.ఫస్ట్ షెడ్యూల్ ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ చేయాలని పరశురామ్ భావిస్తున్నారు.

ఇప్పుడు దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయి.అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఊహించని విధంగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకోవాల్సి వచ్చింది.

ఆయన స్థానంలో మదిని కెమెరామెన్ గా తీసుకున్నారు.నవంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి కెమెరామెన్ తప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా అని తెలుస్తుంది.వ‌కీల్ సాబ్ చిత్రానికి కూడా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడి మరల తాజాగా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.అయితే ఈ లోపే సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ అవుతుంది.దాంతో సర్కారు వారి పాట కు పి.ఎస్.వినోద్ పనిచెయ్యలేకపోతున్నాడని తెలుస్తుంది.మొత్తానికి పవన్ వకీల్ సాబ్ కారణంగా ఆ సినిమాటోగ్రాఫర్ సూపర్ స్టార్ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు