తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్ ల దందాను కట్టడి చేయాలి: కందారపు మురళి

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతున్న దని వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు.

మంగళవారం నాటి ఉదయం 2 గంటల సమయంలో జేసవా అనే బాలుడు కిడ్నీ విఫలమవడంతో మరణించాడు.

మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు వారిని వేడుకున్నా.అంబులెన్స్ దళారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక స్కూటర్ పైనే రాజంపేట జిల్లా లోని చిట్వేలుకు 90 కిలోమీటర్ల మేర బాలున్ని తరలించారు.ఉచితంగా తరలిస్తామని ముందుకు వచ్చిన అంబులెన్స్ ను రానివ్వకుండా దాడికి పూనుకోవడంతో విధి లేక విషమ పరిస్థితిలో ఆ తండ్రి మరణించిన తన బిడ్డను స్కూటర్ పై 90 కిలోమీటర్లు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.కందారపు మురళి సిఐటియు తిరుపతి.

Advertisement
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

తాజా వార్తలు