పవన్ కళ్యాణ్ కు దిష్టి తగలొద్దంటూ పృథ్వీ రాజ్ వైరల్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 శుక్రవారం రిలీజ్ అయింది.

అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ ఫీవర్ పట్టుకుంది.

రిలీజ్ అయిన మొదటి రోజు నుండే వసూళ్ల పండగ మొదలయింది.సినిమా బాగుందనే టాక్ రావడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది.

ఇక సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా సినిమా గురించి పవన్ నటన గురించి పాజిటివ్ స్పందన ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా చాలా మంది సినిమా ప్రముఖులు సినిమా బాగుందని చెప్పడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది.

ఇలా ఎంతో మంది హీరోలు దర్శకనిర్మాతలు పవన్ కల్యాణ్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ రాజ్ భీమ్లా నాయక్ సినిమా చూసి ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ నటనపై పృథ్వి స్పందించిన తీరు ఆసక్తి రేపింది.

Advertisement

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.అడవి రాముడు సినిమాతో భీమ్లాను పోల్చారు.

ఆ రోజుల్లో అడవి రాముడు సినిమా కోసం తాడేపల్లిగూడెంలోని ఒక టాకీస్ కు వెళ్లగా అక్కడ అభిమానుల కోలాహలం పోలీస్ లాఠీచార్జ్ ఇంకా తనకు గుర్తున్నాయని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

అడవిరాముడు సినిమా తన సినీ జీవితంలో మర్చిపోలేనటువంటి సినిమా అని అలాంటి సినిమానే భీమ్లా నాయక్ కూడా అని వాఖ్యానించారు .ఆకాలంలో ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అలాంటి క్రేజ్ ఉందని ఎన్టీఆర్ లాంటి ఫాలోయింగ్ ఉన్నవ్యక్తి మళ్ళీ పవన్ కళ్యానేనని ఆయనకు ఎవరి దిష్టి తగలకూడదని అన్నారు.భీమ్లా నాయక్ లో ఆయన నటన అద్భుతంగా ఉందని ముఖ్యంగా రానా పవన్ కళ్యాణ్ మధ్యలో జరిగే సన్నివేశాల్లో ఇద్దరి నటన చాలా బాగుందని, అయితే ఈ సినిమాలో తాను భాగం కాలేక పోయినందుకు బాధగా ఉందని చెప్పారు.

ఈ మాటలు ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు