డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.ఈ పాటకు ఓ స్పెషాల్టీ ఉంది.అదేంటంటే.
చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం.
ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రం యూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్న ‘గాలి నాగేశ్వరరావు‘ క్యారెక్టర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ రేణుకగా, పాయల్ పాజ్ ఫుత్ స్వాతిగా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.
డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.