ప్రభాస్‌ ఈ రెండేళ్ల లెక్క తేలిపోయింది.. రెండు ప్లస్ రెండు కన్ఫర్మ్‌

టాలీవుడ్ మరియు సౌత్ ఇండియా లో మాత్రమే కాకుండా యావత్ భారత దేశం లో కూడా ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరో అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఆయన చేసిన సినిమాలు.

ఆ సినిమాలు విడుదల అవుతున్న థియేటర్లు కూడా ఆయన స్థాయిని చూపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా పది వేల స్క్రీన్స్ లో విడుదలకు సిద్ధం అయింది.

ఇంత భారీ స్థాయిలో కేవలం హాలీవుడ్ సినిమాలు మాత్రమే విడుదల అవుతాయి.ఈ స్థాయి రిలీజ్ దక్కించుకున్న రాధేశ్యామ్ సినిమా కచ్చితంగా భారీ వసూళ్ల ను దక్కించుకుంటుంది అనే నమ్మకం ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయం లోనే ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాల గురించి కూడా చర్చ మొదలైంది.రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభాస్ నుంచి ఐదు సినిమాలు రాబోతున్నాయి.

Advertisement

ఆయన సినిమాల్లో మొదటగా ఈ వారంలో రాధేశ్యామ్ విడుదల కాబోతుంది.ఇదే ఏడాది ద్వితీయార్థం లో మారుతి దర్శకత్వం లో రూపొందబోతున్న రాజా డీలక్స్ సినిమా కూడా రాబోతుంది.2022 సంవత్సరం లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 2023 సంవత్సరం లో ఏకంగా మూడు సినిమా లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం అందుతోంది.2023 ఆరంభం లోనే ఆదిపురుష్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాబోతున్నాడు.ఆ వెంటనే సమ్మర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమాను విడుదల చేయబోతున్నాడు.

ఇక ప్రాజెక్టు కే సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇలా రాబోయే రెండేళ్లలో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ 5 సినిమాల విలువ దాదాపుగా రెండున్నర నుంచి మూడు వేల కోట్ల వరకు ఉంటుంది అంటూ విశ్లేషకుల అంచనా.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు