కేజీఎఫ్ లో చనిపోయిన కుర్రాడే సలార్ లో హీరోనా.. షాకింగ్ ట్విస్ట్ అంటూ?

ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్లు తమ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

సలార్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ సినిమాలో ఈశ్వరీ రావు పాత్ర కొడుకుగా ఒక వ్యక్తి కనిపించిన సంగతి తెలిసిందే.అధీర ముఠా చేతిలో చనిపోయిన వ్యక్తిగా ఆ పాత్రను సినిమాలో చూపించారు.అయితే ఆ పాత్రనే సలార్ గా సలార్ మూవీలో ఉంటుందని తెలుస్తోంది.కేజీఎఫ్2 లో చనిపోయినట్టు చూపించిన ఆ పాత్రను మళ్లీ బ్రతికించి ప్రశాంత్ నీల్ షాకింగ్ ట్విస్ట్ తో సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది.అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు సలార్ సినిమాలో యశ్ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల గురించి నిర్మాత క్లారిటీ ఇచ్చారు.ఆ వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు.

సలార్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

సలార్ మూవీలో సన్నివేశాలు కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.శృతి హాసన్ ప్రభాస్ కాంబినేషన్ లో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిన శృతి హాసన్ సలార్ తో మరోసారి హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శృతి ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ప్రభాస్, శృతి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని ఆ సన్నివేశాలు కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

సలార్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు