సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలుగా చిరంజీవి, రవితేజలకు పేరుంది.ఈ ఇద్దరు హీరోలకు ఊహించని స్థాయిలో అభిమానులు సైతం ఉన్నారు.
ఈరోజు రవితేజ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు రవితేజ స్థాయిని పెంచాయి.
మొన్నటివరకు 18 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న రవితేజ ఇప్పుడు 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
నా తమ్ముడు రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరంజీవి పేర్కొన్నారు.ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నిండు నూరేళ్లు రవితేజ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
వాల్తేరు వీరయ్య సెట్స్ లో దిగిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
చిరంజీవి చేసిన ఈ పోస్ట్ కు 30000 కు పైగా లైక్స్ వచ్చాయి.చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నయ్య, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించడం గమనార్హం.మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కోరుకున్న హిట్ ను ఇచ్చారు.
చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు.భోళా శంకర్ మూవీ వేదాళం మూవీ రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుంది.చిరంజీవితో కలిసి పని చేయడానికి రవితేజ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
నటుడిగా చిరంజీవి స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని చిరంజీవి సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ ల గురించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.