అసలే సమ్మర్ సీజన్ కొనసాగుతోంది.ఈ సీజన్లో ప్రధానంగా వేధించే చర్మ సమస్య సన్ ట్యాన్.
కాసేపు ఎండలో ఉంటే చాలు ముఖం నల్లగా, నిర్జీవంగా మారిపోతుంటుంది.అందులోనూ సన్ స్క్రీన్ను ఎవైడ్ చేసే వారి చర్మం మరింత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది.
దాంతో ట్యాన్ను పోగొట్టుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే ట్యాన్ తొలగిపోవడమే కాదు ముఖం తెల్లగా, తాజాగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక కీర దోసను తీసుకుని వాటర్లో కడిగి సన్నగా తురుము కోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కీర జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కుకుంబర్ జెల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై మెల్లగా వేళ్లతో చర్మాన్ని రుద్దుకుంటూ వాటర్తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.అనంతరం ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా చేయడం వల్ల ట్యాన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.అదే సమయంలో ముఖం తెల్లగా, మృదువుగా మరియు కాంతివంతంగా కూడా మెరుస్తుంది.
కాబట్టి, ట్యాన్ సమస్యతో బాధ పడే వారు పైన చెప్పిన సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని తప్పకుండా ట్రై చేసేందుకు ప్రయత్నించండి.