మోడీని మెప్పించి కేంద్ర మంత్రి పదవి అందుకున్న సారంగి గురించే కచ్చితంగా తెలుసుకోవాలి

దేశంలో విపక్షాలు అన్ని మోడీని వ్యతిరేకిస్తున్న అతను తన ప్రభుత్వంలో ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న వారికి, తెలివైన వారుగా ముద్ర వేసుకున్నవారికి మంత్రి వర్గంలో అవకాశాలు ఇస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.

రాజకీయాలు అంటే ఎంత సేపు దోచుకోవడం, దాచుకోవడం అనే సిద్ధాంతానికి విరుద్ధంగా పరిపాలనలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మోడీ క్యాబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించిన ఓడిశాకి చెందినకి ప్రతాప్ చంద్ర సారంగి ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.అతని గురించి తెలిసిన వారు ఇప్పుడు అలాంటి వ్యక్తిగా మోడీ మంత్రి పదవి ఇచ్చి తగిన గౌరవం ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

ఒడిషాలోని బాలాసోర్ నుంచి ఎన్నికైన సారంగి ఎంపీగా ఉన్న కూడా ఇప్పటికీ పూరిగుడిసెలోనే జీవిస్తూ ఉన్నాడు.సైకిల్ పైనే ప్రజా సమస్యలను తెలుసుకుంటాడు.

భుజానా సంచీ కుర్తా పైజామాలో సాదాసీదాగా కార్యకర్తలా కనిపిస్తాడు.అతని వ్యక్తిత్వం రాజకీయ జీవితంలో నిరాడంబరతే ఇప్పుడు ఆయనకి మంత్రి వర్గంలో స్థానం కల్పించింది.64 ఏళ్ల ప్రతాప్ చంద్ర ఈసారి ఎన్నికల్లో బాలాసోర్ నుంచి పోటీపడగా ఈయన మీద బీజేపీ తరుఫున కోటీస్వరుడైన రబింద్ర కుమార్ జెనా కాంగ్రెస్ నుంచి నవజ్యోతి పట్నాయ్ పోటీచేశారు.ఇద్దరిని ఓడించి భారీ మెజారిటీతో గెలిచినా ఇతను బీజేపీ పార్టీ కాకున్న మోడీ పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చి అతనిని గౌరవించారు.

Advertisement

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు వచ్చిన డబ్బులతో గిరిజన విద్యార్థుల చదువుకు సారంగి వెచ్చిస్తుంటాడు.ఇలా సాదాసీదాగా ఉంటూ పేద ఎంపీగా సేవ చేస్తున్న సారంగి గొప్పతనంపై సోషల్ మీడియాలో మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు