మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ”బ్రో ది అవతార్”.( Bro The Avatar ) వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత తేలిపోయింది.రోజురోజుకూ కలెక్షన్స్ భారీగా తగ్గుతూ వస్తున్న ఈ సినిమా విషయంలో అంబటి రాంబాబు( Ambati Rambabu ) సీరియస్ గా ఉన్నారు.
అందుకు కారణం ఈ సినిమా చూసిన వారికీ తెలిసే ఉంటుంది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను పృథ్వీ తో కావాలని చేయించారని ఆయన ఆరోపించారు.
అలాగే నిర్మాత ఈ సినిమాను బ్లాక్ మనీతో తీసారని పవన్ కు ఇచ్చిన పారితోషికం అంత కూడా ఈ సినిమా కలెక్షన్స్ రాలేదని అంతా ఆయన సెటైర్స్ వేయగా విశ్వప్రసాద్ కూడా ఈయన వ్యాఖ్యలకు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
ఇలా బ్రో సినిమాతో పవన్ వర్సెస్ అంబటి లా సిచ్యువేషన్ మారిపోవడంతో బ్రో సినిమా వార్తల్లో నిలుస్తుంది.ఇక బ్రో కలెక్షన్స్ పెరగడానికి కారణం కూడా ఈ వివాదం అంటున్నారు.ఇదిలా ఉండగా వీరి మధ్యలోకి నేనున్నా అంటూ దూరింది హీరోయిన్ పూనమ్ కౌర్.
( Poonam Kaur ) ఈ భామ ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేద్దామని ఎదురు చూస్తుంది అనే విషయం అందరికి తెలుసు.
అయితే ఈసారి ఈమె ఎవరి పేరు ట్యాగ్ చేయకుండా ట్వీట్ చేసిన ఇది పవన్, అంబటి వివాదంపై అని అందరికి అర్ధం అయ్యింది.ఈమె ట్వీట్ చేస్తూ ”రాజకీయాలు ఎంటర్టెయిన్మెంట్ చుట్టూ తిరుగుతుంటే.ఎంటర్టెయిన్మెంట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయంటూ” ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ తో ఈమె మరోసారి పవన్ పై సెటైర్స్ వేయడంతో ఫ్యాన్స్ ఈ భామను ఆడేసుకుంటున్నారు.