రెమ్యునరేషన్ లో టాప్ చైర్ లో కూర్చున్న పూజా హెగ్డే

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే.

ఈ అమ్మడు నటించిన రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

అందులో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా ఉండటం విశేషం.మరో వైపు హిందీలో మూడు భారీ ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టింది.

అలాగే తమిళ్ లో విజయ్ సేతుపతికి జోడీగా బీస్ట్ మూవీలో నటిస్తుంది.ఇదికూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.

అలాగే మరో రెండు తెలుగు సినిమాలకి సైన్ చేసినట్లు తెలుస్తుంది.ఇలా ఫుల్ బిజీ హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే తన హవాని కొనసాగిస్తుంది.

Advertisement

ఈ నేపధ్యంలో ఈ బ్యూటీ తన తొమ్మిదేళ్ళ కెరియర్ లో ప్రస్తుతం టాప్ పొజిషన్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగిస్తుంది.ఇప్పటి వరకు సౌత్ హీరోయిన్స్ కి అత్యధికంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే వారు.

గతంలో అనుష్క, నయనతార మూడు కోట్ల వరకు తీసుకున్నారు.వీరికి ఇచ్చిందే ఇప్పటికే హైయెస్ట్ రెమ్యునరేషన్ క్రింద ఉండేది.

అయితే ఇప్పుడు పూజా హెగ్డే వీళ్ళని బీట్ చేసింది.ఈ అమ్మడు ప్రస్తుతం ఒక్కో సినిమాకి 3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.దీనిని బట్టి ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా పూజా హెగ్డే నిలిచింది.

ఆమె క్రేజ్ నేపధ్యంలో సౌత్ నిర్మాతలు కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.భవిష్యత్తులో పూజా హెగ్డే రెమ్యునరేషన్ 5 కోట్ల వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే టాక్ వినిపిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

గతంలో బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకొని స్టార్ కథానాయికలకి మాత్రమే భారీ మొత్తం చెల్లించగా ఇప్పుడు ఇక్కడి స్టార్స్ హీరోయిన్స్ ఆ స్థాయిని అందుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు