కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ ( YCP ) సరికొత్త వ్యూహాలు రచిస్తుంది.
కాపు సామాజిక వర్గ బాధ్యతలను ఇప్పటికే ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధిష్టానం అప్పగించిందని తెలుస్తోంది.అలాగే మూడు మండలాల ఇంఛార్జ్ బాధ్యతలను రాష్ట్ర నాయకులకు అప్పగించిందని సమాచారం.
ఈ క్రమంలోనే పిఠాపురం మండల ఇంఛార్జ్ గా ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి( Coordinator Mithun Reddy ), యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా ( Daissetty Raja )మరియు గొల్లప్రోలు మండల బాధ్యతలను మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పార్టీ హైకమాండ్ అప్పగించింది.దాంతోపాటు ఆర్థిక పరమైన అంశాలకు ప్రత్యేక ఇంఛార్జ్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ ను నియమించింది.పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించడమే ధ్యేయంగా ఇంఛార్జ్ లు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు పవన్ తరపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం మొదలు పెట్టారు.







