జయరాం హత్య కేసులో సంచలన విషయాలు బయట పడుతున్న సంచలన నిజాలు!

న్యూస్ ఛానల్ అధినేత, ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు సంబంధించిన విచారణలో హైదరాబాద్ పోలీసులు పలు ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నారు.

ఇప్పటికే ఈ హత్య కేసులో రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తూ పలు సంచలన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏమి అలాగే రాకేష్ రెడ్డి తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వారిని విచారించే ప్రయత్నం చేస్తున్నారు.హత్యానంతరం రాకేష్ రెడ్డి కొంతమంది పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు ఆధారాలతో సహా రావడంతో వారిని సస్పెండ్ చేశారు.

ఇక తాజాగా విషయాలను హైదరాబాద్ పోలీసులు బయట పెట్టారు.జయరామ్ హత్య రాకేష్ రెడ్డి కేవలం చేశాడని తనకు చెల్లించాల్సిన అప్పు చెల్లించక పోవడం వలన చేశాడని వాదనలు వినిపించాయి.

అయితే అసలు రాకేష్ రెడ్డి అసలు ఎలాంటి అప్పు ఇవ్వలేదని, కొంతమంది రియల్టర్లు, రౌడీ షీటర్ తో కలిపి పేపర్ సృష్టించి అప్పు ఇచ్చినట్లు నమ్మించి జయరాం నుంచి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం చేసినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది.ఈ నేపథ్యంలోనే రాకేశ్రెడ్డి చింతల కు చెందిన రౌడీషీటర్ తో కలిపి జయరామ్ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

ఈ కేసులో ఇప్పటికే 11 పోలీసు అధికారులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అలాగే సినీ నటుడు భరత్ ని కూడా జయరాం హత్య కేసులో విచారిస్తున్నారు.

పోలీసుల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జయరామ్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది.మరి ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు బయట పెట్టబోయే సంచలన విషయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు